Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
బ్యారెల్ ముడి చమురు @120 డాలర్లు!

బ్యారెల్ ముడి చమురు @120 డాలర్లు!

పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇరాన్ యుద్ధం ముదరడంతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడి, ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 119.50 డాలర్ల మార్కును తాకాయి. రెండో వారంలోనూ చమురు నిల్వలు, రవాణా మార్గాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది.

తెలంగాణలో క్రీడారంగాన్నిఅంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో క్రీడారంగాన్నిఅంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా మౌలిక వసతుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబర్చేలా అత్యాధునిక సదుపాయాలతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

నెతన్యాహుతో చర్చించాకే యుద్ధం ముగింపుపై నిర్ణయం: ట్రంప్

నెతన్యాహుతో చర్చించాకే యుద్ధం ముగింపుపై నిర్ణయం: ట్రంప్

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడం అనేది అమెరికా, ఇజ్రాయెల్‌ల ఉమ్మడి నిర్ణయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సంప్రదించిన తర్వాతే, సరైన సమయంలో తాను తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు.

తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రిటర్నింగ్ అధికారి అధికారిక ప్రకటన చేశారు. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ పరిశీలనలో తిరస్కరించబడింది. ఎంపికకు కాంగ్రెస్‌కు ఎంఐఎం, సీపీఐ మద్దతు లభించింది.

ఎన్టీపీసీతో విద్యుత్ ఒప్పందాలు చేసుకోండి: సీఎంకి.. కిషన్ రెడ్డి లేఖ

ఎన్టీపీసీతో విద్యుత్ ఒప్పందాలు చేసుకోండి: సీఎంకి.. కిషన్ రెడ్డి లేఖ

రామగుండంలోని ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తక్కువ ధరకే రాష్ట్రానికి అందుబాటులోకి తీసుకురావచ్చని కిషన్ రెడ్డి సూచించారు. భవిష్యత్‌లో పెరిగే విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని లేఖలో పేర్కొన్నారు.

‘కరూర్’ కేసులో విజయ్‌కు సీబీఐ నుంచి మళ్లీ పిలుపు

‘కరూర్’ కేసులో విజయ్‌కు సీబీఐ నుంచి మళ్లీ పిలుపు

కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) విచారణకు హాజరుకావాలని విజయ్‌ను కోరినట్లు సమాచారం.

కునోలో చిరుత జ్వాలాకు ఐదు పిల్లల జననం

కునోలో చిరుత జ్వాలాకు ఐదు పిల్లల జననం

భారతదేశంలో చేపట్టిన చిరుత పునరావాస ప్రాజెక్ట్‌ మరో కీలక మైలురాయి చేరుకుంది. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుత జ్వాలా సోమవారం ఐదు పిల్లలకు జన్మనివ్వడంతో దేశంలో చిరుతల మొత్తం సంఖ్య 53కు చేరింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య స్వదేశానికి చేరిన 500 మందికి పైగా ఏపీ వాసులు

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య స్వదేశానికి చేరిన 500 మందికి పైగా ఏపీ వాసులు

పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల విమాన సర్వీసులు అంతరాయం కలగడంతో గల్ఫ్ దేశాల్లో ఇరుక్కుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 500 మందికి పైగా ప్రజలు ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా స్వదేశానికి చేరుకున్నారు. ఇంకా కొందరిని తీసుకురావడానికి అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

బ్లాక్ చెయిన్ సాంకేతికతతో భూరికార్డులకు పటిష్ట రక్షణ: సీఎం

బ్లాక్ చెయిన్ సాంకేతికతతో భూరికార్డులకు పటిష్ట రక్షణ: సీఎం

గ్రామ సభలో రైతులతో మాట్లాడిన ఆయన, భూమి రికార్డుల డిజిటల్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఉద్యాన పంటల ప్రదర్శన స్టాళ్లను సందర్శించి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. లాభదాయక పంటలను ప్రోత్సహించాలని భూగర్భ జలాల స్థాయి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

రూ.14.88 కోట్ల భారీ వ్యయంతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు మంత్రి నారా లోకేష్ రిబ్బన్ కట్ చేసి అనంతరం స్విచ్ ఆన్ చేయడం ద్వారా పంపుల నుంచి నీటి పంపిణీని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.

రాజవొమ్మంగి అడవుల్లోకి కూర్మాపురం పెద్ద పులి

రాజవొమ్మంగి అడవుల్లోకి కూర్మాపురం పెద్ద పులి

పాపికొండల జాతీయ ఉద్యానవనం నుంచి ఏలేరు రిజర్వాయర్ పరిసరాల మీదుగా ప్రయాణిస్తూ ఈ పులి కొత్త ఆవాసం కోసం రాజవొమ్మంగి అటవీ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అటవీ సిబ్బంది దాని కదలికలను అత్యాధునిక పరికరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

తిరుపతి జిల్లాలో విషాదం... విద్యుత్ కంచె తగిలి రెండు ఏనుగులు మృతి

తిరుపతి జిల్లాలో విషాదం... విద్యుత్ కంచె తగిలి రెండు ఏనుగులు మృతి

తిరుపతి జిల్లా తలకోన రిజర్వ్ అటవీ ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చిన రెండు ఆసియా ఏనుగులు సాగు భూముల్లో ఏర్పాటు చేసిన అక్రమ విద్యుత్ కంచెను తాకి ప్రాణాలు కోల్పోయాయి.

అవినీతిని సహించను.. అభివృద్ధిలో రాజీ పడొద్దు: ఎమ్మెల్యే పులివర్తి నాని

అవినీతిని సహించను.. అభివృద్ధిలో రాజీ పడొద్దు: ఎమ్మెల్యే పులివర్తి నాని

చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన . కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో రూరల్ మండలంలో జరిగిన అభివృద్ధి పనులపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.

బుల్కాపూర్ వద్ద పగిలిన భారీ పైప్‌లైన్

బుల్కాపూర్ వద్ద పగిలిన భారీ పైప్‌లైన్

బుల్కాపూర్ వద్ద పగిలిన ప్రధాన పైప్‌లైన్‌పై అధికారులు అత్యవసర మరమ్మతులు చేపట్టారు. నీటి వృథా నివారించేందుకు సరఫరా తాత్కాలికంగా నిలిపివేసి, ప్రభావిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు.

భారత్ టీ20 వరల్డ్ కప్ ‘హ్యాట్రిక్’ కొట్టాలి: మంత్రి అజారుద్దీన్

భారత్ టీ20 వరల్డ్ కప్ ‘హ్యాట్రిక్’ కొట్టాలి: మంత్రి అజారుద్దీన్

తెలంగాణ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మను ఘనంగా సత్కరించేందుకు ప్రయత్నిస్తామని అజారుద్దీన్ తెలిపారు. అండర్-19 ప్రపంచకప్ విజేత ఆరన్ జార్జ్‌ను కూడా సత్కరించే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు.

కరీంనగర్‌లో స్వచ్ఛత సందేశంతో 2కే రన్

కరీంనగర్‌లో స్వచ్ఛత సందేశంతో 2కే రన్

కళాభారతి నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు జరిగిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని శ్రమదానం చేశారు. స్వచ్ఛతపై అవగాహన పెంచుతూ ప్రజలు, యువతను బాధ్యతాయుతంగా మారాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ‌లో మరో ఐదు రోజుల్లో భారీ వర్షాలు

తెలంగాణ‌లో మరో ఐదు రోజుల్లో భారీ వర్షాలు

మార్చి 9–11 మధ్య ఉష్ణోగ్రతలు కొంత తగ్గి తాత్కాలిక ఉపశమనం లభించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. అయితే మార్చి 16–23 మధ్య పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వానలు కురిసే అవకాశంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇందిరా పార్కులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

ఇందిరా పార్కులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

పార్క్‌లో పారిశుధ్య పరిస్థితులు, మౌలిక వసతులను కమిషనర్ సమీక్షించారు. పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించాలని, దెబ్బతిన్న పిల్లల ఆట స్థలాన్ని మరమ్మతులు చేసి త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు.

నీతి ఆయోగ్ సెమినార్‌లో నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్

నీతి ఆయోగ్ సెమినార్‌లో నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్

పెంబి బ్లాక్ విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారతలో సాధించిన ప్రగతి నీతి ఆయోగ్ సెమినార్‌లో ప్రజా, అధికారుల భాగస్వామ్యంతో జిల్లా కలెక్టర్ అభిలాష వివరించారు.

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖమేనీ

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా దివంగత అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ నియమితులయ్యారు. యుద్ధం మధ్యలో నిపుణుల మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ట్రంప్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించగా, ఇరాన్ సైన్యం మద్దతు తెలిపింది.

డ్రగ్ బోటుపై అమెరికా సైన్యం దాడి.. ఆరుగురి మృతి

డ్రగ్ బోటుపై అమెరికా సైన్యం దాడి.. ఆరుగురి మృతి

డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా సైన్యం సముద్ర మార్గాల్లో దాడులను ఉధృతం చేసింది. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నట్లు అనుమానిస్తున్న ఒక బోటుపై ఆదివారం అమెరికా బలగాలు జరిపిన మెరుపు దాడిలో ఆరుగురు వ్యక్తులు మరణించారు.

కరువు కోరల్లో మలావి.. భారత్ ఆపన్నహస్తం

కరువు కోరల్లో మలావి.. భారత్ ఆపన్నహస్తం

తీవ్రమైన కరువు పరిస్థితులతో ఆహార సంక్షోభంలో చిక్కుకున్న ఆఫ్రికా దేశం మలావిని ఆదుకునేందుకు భారత్ మానవతా దృక్పథంతో ముందుకొచ్చింది. ‘ఎల్ నినో’ ప్రభావంతో పంటలు పండక ఇబ్బందులు పడుతున్న ఆ దేశ ప్రజల కోసం 1,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారత్ పంపింది.

అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభం

అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభం

అమెరికా-దక్షిణ కొరియా ఉమ్మడి సైనిక విన్యాసాలు 'ఫ్రీడమ్ షీల్డ్' ప్రారంభమయ్యాయి. సుమారు 18,000 మంది సైనికులు పాల్గొంటున్న ఈ శిక్షణలో క్షేత్రస్థాయి విన్యాసాలను తగ్గించడం గమనార్హం. ఉత్తర కొరియాతో చర్చల కోసం దౌత్య మార్గాలను తెరిచే ఉద్దేశంతోనే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌లో ఇంధన కటకట.. వర్సిటీలు బంద్

బంగ్లాదేశ్‌లో ఇంధన కటకట.. వర్సిటీలు బంద్

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను తీవ్ర ఇంధన సంక్షోభంలోకి నెట్టాయి. విద్యుత్, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలన్నింటినీ సోమవారం నుంచే మూసివేశారు.

ఆర్కిటిక్‌లో ‘నాటో’ యుద్ధ విన్యాసాలు

ఆర్కిటిక్‌లో ‘నాటో’ యుద్ధ విన్యాసాలు

ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు కోసం రష్యా, చైనాలు వేస్తున్న ఎత్తుగడలకు అడ్డుకట్ట వేసేందుకు నాటో తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 'కోల్డ్ రెస్పాన్స్' పేరుతో చేపట్టిన భారీ సైనిక విన్యాసాలు సోమవారం ఉత్తర ధృవ ప్రాంతంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మార్చి 19 వరకు సాగే ఈ యుద్ధ విన్యాసాల్లో అమెరికా, డెన్మార్క్ సహా 14 దేశాలకు చెందిన సుమారు 25,000 మంది సైనికులు పాల్గొంటున్నారు.

టర్కీ తీరంలో పడవ ప్రమాదం.. 14 మంది వలసదారుల మృతి

టర్కీ తీరంలో పడవ ప్రమాదం.. 14 మంది వలసదారుల మృతి

టర్కీ తీరంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సోమవారం మధ్యధరా సముద్రంలో వలసదారులతో వెళ్తున్న ఒక బోటు, అక్కడి కోస్ట్ గార్డ్ (తీర రక్షక దళం) నౌకను ఢీకొనడంతో 14 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.

సంభాషణే మార్గం.. భారతీయుల భద్రతే ప్రాధాన్యం: జైశంకర్

సంభాషణే మార్గం.. భారతీయుల భద్రతే ప్రాధాన్యం: జైశంకర్

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్తతలు తగ్గించి సంభాషణ, దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించాలని భారత్ కోరుకుంటుందని విదేశాంగ మంత్రి సుబ్రమణ్​యం జైశంకర్‌‌ అన్నారు.

‘ఎయిర్ ఇండియా’ ప్రమాదం..త్వరలోనే నివేదిక సమర్పిస్తాం: రామ్మోహన్ నాయుడు

‘ఎయిర్ ఇండియా’ ప్రమాదం..త్వరలోనే నివేదిక సమర్పిస్తాం: రామ్మోహన్ నాయుడు

సోమవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు అదనపు ప్రశ్నలకు మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు. గత ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా కుప్పకూలిన ఎయిర్ ఇండియా (AI171) విమాన ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వేగంగా దర్యాప్తు చేస్తోందని ఈ ఏడాది చివరి లోపు నివేదిక వెలువడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

పశ్చిమాసియాపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదు: రాహుల్ గాంధీ

పశ్చిమాసియాపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదు: రాహుల్ గాంధీ

పశ్చిమ ఆసియా సంక్షోభంపై పార్లమెంట్‌లో చర్చ జరగకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదని, చర్చ జరిగితే ప్రధానమంత్రి నిజరూపం బయటపడుతుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం ఆరోపించారు.

ఖమ్మం కూల్చివేతలు..700 మంది నిరాశ్రయులయ్యారు: క‌విత‌

ఖమ్మం కూల్చివేతలు..700 మంది నిరాశ్రయులయ్యారు: క‌విత‌

ఖమ్మం వెలుగుమట్ల వినోబా నగర్‌లో ఇళ్ల కూల్చివేతలతో వందల కుటుంబాలు తాత్కాలిక ఆశ్రయాల్లో నివసిస్తున్నాయి. బాధితులకు తగిన సౌకర్యాలు లేవని ప్రతిపక్షాలు ఆరోపించగా, భూదాన్ భూములపై అక్రమ నిర్మాణాల తొలగింపే చర్యలని ప్రభుత్వం చెబుతోంది.

హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు

హైడ్రా ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులు

స్మశానాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, చెరువులపై జరుగుతున్న ఆక్రమణలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలను పరిశీలించిన అధికారులు సంబంధిత శాఖలకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

మూసీ ప్రక్షాళన.. 'నైట్ ఎకానమీ'తో ఉపాధి అవకాశాలు: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ ప్రక్షాళన.. 'నైట్ ఎకానమీ'తో ఉపాధి అవకాశాలు: సీఎం రేవంత్ రెడ్డి

మూసీ పునరుద్ధరణతో పాతబస్తీలో రాత్రి ఆర్థిక కార్యకలాపాలను విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నిర్వాసితులకు ప్రత్యామ్నాయ గృహాలు కల్పిస్తామని సీఎం తెలిపారు.

మా తదుపరి లక్ష్యం ఒలింపిక్ స్వర్ణం: సూర్యకుమార్ యాదవ్

మా తదుపరి లక్ష్యం ఒలింపిక్ స్వర్ణం: సూర్యకుమార్ యాదవ్

టీ20 ప్రపంచకప్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు, ఇప్పుడు తన దృష్టిని ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ క్రీడలపై మళ్లించింది. మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆనందంలో ఉన్న భారత సారథి సూర్యకుమార్ యాదవ్, జట్టు తదుపరి లక్ష్యం 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడమేనని స్పష్టం చేశారు.

నేటి నుంచి ‘స్విస్ ఓపెన్’ సమరం

నేటి నుంచి ‘స్విస్ ఓపెన్’ సమరం

బ్యాడ్మింటన్ ప్రపంచంలో మరో కీలక పోరుకు తెరలేచింది. బాసెల్ (స్విట్జర్లాండ్) వేదికగా నేటి నుంచి ప్రతిష్ఠాత్మక 'స్విస్ ఓపెన్ 2026' సూపర్-300 టోర్నీ ప్రారంభం కానుంది. గత వారం జరిగిన ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే అనూహ్యంగా ఓటమి పాలైన భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఈ టోర్నీలో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు.

వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్‌లో భారత బాక్సర్ల జోరు

వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్‌లో భారత బాక్సర్ల జోరు

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న 'వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ 2026'లో భారత యువ బాక్సర్లు తమ సత్తా చాటుతున్నారు. టోర్నీ రెండో రోజైన సోమవారం జరిగిన పోటీల్లో భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించినప్పటికీ, ప్రధాన బాక్సర్లు రాధామణి లాంగ్జామ్, సాహిల్ దుహాన్ తమ ప్రత్యర్థులపై ఘనవిజయం సాధించి తర్వాతి రౌండ్‌కు దూసుకెళ్లారు.

శ్రీలంక హెడ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్

శ్రీలంక హెడ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్

భారత జట్టుకు 2011 ప్రపంచకప్ అందించిన మాజీ దిగ్గజ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ఇప్పుడు శ్రీలంక క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టారు. సోమవారం శ్రీలంక క్రికెట్ బోర్డు ఆయనను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఏ పేటీఎం బ్యాచ్ నా సినిమాను ఆపలేదు.. ‘మంగపతి’ వార్నింగ్

ఏ పేటీఎం బ్యాచ్ నా సినిమాను ఆపలేదు.. ‘మంగపతి’ వార్నింగ్

శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాపై మిక్స్డ్ టాక్ రావడంతో శివాజీ స్పందించారు.సోషల్ మీడియాలో కొందరు పేటీఎం బ్యాచ్ కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.అయితే మంచి సినిమాను ఎవరూ ఆపలేరని, వారం రోజుల్లోనే ఈ సినిమా సత్తా ప్రేక్షకులకు తెలుస్తుందని శివాజీ ధీమా వ్యక్తం చేశారు.

‘స్వేచ్ఛ’ ఇచ్చే నిజమైన ప్రేమ కావాలి ….రష్మిక ట్వీట్

‘స్వేచ్ఛ’ ఇచ్చే నిజమైన ప్రేమ కావాలి ….రష్మిక ట్వీట్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఉదయ్‌పూర్‌లో జరిగిన ప్రైవేట్ వేడుకలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.వారి ప్రేమ ప్రయాణంపై ఒక నెటిజన్ రాసిన భావోద్వేగ ఆర్టికల్ చూసి రష్మిక స్పందిస్తూ ప్రేమ అంటే స్వేచ్ఛ ఇవ్వడం-అని సందేశం ఇచ్చారు.పెళ్లి తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న పీరియడ్ యాక్షన్ చిత్రం రణబలిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

యష్ రాజ్ ఫిల్మ్స్ ‘ఆల్ఫా’ రిలీజ్ ఎప్పుడంటే?

యష్ రాజ్ ఫిల్మ్స్ ‘ఆల్ఫా’ రిలీజ్ ఎప్పుడంటే?

అలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో గూఢచారి ఏజెంట్లుగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను శివ రావైల్ తెరకెక్కిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద 'డాల్బీ సినిమా' థియేటర్‌

హైదరాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద 'డాల్బీ సినిమా' థియేటర్‌

హైదరాబాద్‌లో కొత్త డాల్బీ థియేటర్‌లో 644 సీట్లు, 4కే డ్యుయల్ లేజర్, 64-చానెల్ అట్మాస్ సౌండ్, పెద్ద స్క్రీన్‌తో విలాసవంతమైన సినిమా అనుభవం అందిస్తుంది.

మార్చి 13 నుంచి ఓటీటీలోకి ‘ భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తి’

మార్చి 13 నుంచి ఓటీటీలోకి ‘ భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తి’

మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తిచిత్రం మార్చి 13 నుంచి ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ కానుంది.కుటుంబ కథా నేపథ్యంలో భార్య–ప్రేయసి మధ్య చిక్కుకున్న వ్యక్తి జీవితాన్ని ఆసక్తికరంగా చూపిస్తుంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

క్రీడలు

మా తదుపరి లక్ష్యం ఒలింపిక్ స్వర్ణం: సూర్యకుమార్ యాదవ్

మా తదుపరి లక్ష్యం ఒలింపిక్ స్వర్ణం: సూర్యకుమార్ యాదవ్

టీ20 ప్రపంచకప్‌లో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన భారత జట్టు, ఇప్పుడు తన దృష్టిని ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ క్రీడలపై మళ్లించింది. మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆనందంలో ఉన్న భారత సారథి సూర్యకుమార్ యాదవ్, జట్టు తదుపరి లక్ష్యం 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడమేనని స్పష్టం చేశారు.

నేటి నుంచి ‘స్విస్ ఓపెన్’ సమరం

నేటి నుంచి ‘స్విస్ ఓపెన్’ సమరం

బ్యాడ్మింటన్ ప్రపంచంలో మరో కీలక పోరుకు తెరలేచింది. బాసెల్ (స్విట్జర్లాండ్) వేదికగా నేటి నుంచి ప్రతిష్ఠాత్మక 'స్విస్ ఓపెన్ 2026' సూపర్-300 టోర్నీ ప్రారంభం కానుంది. గత వారం జరిగిన ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే అనూహ్యంగా ఓటమి పాలైన భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఈ టోర్నీలో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు.

సినిమాలు

ఏ పేటీఎం బ్యాచ్ నా సినిమాను ఆపలేదు.. ‘మంగపతి’ వార్నింగ్

ఏ పేటీఎం బ్యాచ్ నా సినిమాను ఆపలేదు.. ‘మంగపతి’ వార్నింగ్

శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాపై మిక్స్డ్ టాక్ రావడంతో శివాజీ స్పందించారు.సోషల్ మీడియాలో కొందరు పేటీఎం బ్యాచ్ కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.అయితే మంచి సినిమాను ఎవరూ ఆపలేరని, వారం రోజుల్లోనే ఈ సినిమా సత్తా ప్రేక్షకులకు తెలుస్తుందని శివాజీ ధీమా వ్యక్తం చేశారు.

‘స్వేచ్ఛ’ ఇచ్చే నిజమైన ప్రేమ కావాలి ….రష్మిక ట్వీట్

‘స్వేచ్ఛ’ ఇచ్చే నిజమైన ప్రేమ కావాలి ….రష్మిక ట్వీట్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఉదయ్‌పూర్‌లో జరిగిన ప్రైవేట్ వేడుకలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.వారి ప్రేమ ప్రయాణంపై ఒక నెటిజన్ రాసిన భావోద్వేగ ఆర్టికల్ చూసి రష్మిక స్పందిస్తూ ప్రేమ అంటే స్వేచ్ఛ ఇవ్వడం-అని సందేశం ఇచ్చారు.పెళ్లి తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న పీరియడ్ యాక్షన్ చిత్రం రణబలిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

యష్ రాజ్ ఫిల్మ్స్ ‘ఆల్ఫా’ రిలీజ్ ఎప్పుడంటే?

యష్ రాజ్ ఫిల్మ్స్ ‘ఆల్ఫా’ రిలీజ్ ఎప్పుడంటే?

అలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో గూఢచారి ఏజెంట్లుగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను శివ రావైల్ తెరకెక్కిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద 'డాల్బీ సినిమా' థియేటర్‌

హైదరాబాద్‌లో ఆసియాలోనే అతిపెద్ద 'డాల్బీ సినిమా' థియేటర్‌

హైదరాబాద్‌లో కొత్త డాల్బీ థియేటర్‌లో 644 సీట్లు, 4కే డ్యుయల్ లేజర్, 64-చానెల్ అట్మాస్ సౌండ్, పెద్ద స్క్రీన్‌తో విలాసవంతమైన సినిమా అనుభవం అందిస్తుంది.

మార్చి 13 నుంచి ఓటీటీలోకి ‘ భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తి’

మార్చి 13 నుంచి ఓటీటీలోకి ‘ భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తి’

మాస్ మహారాజా రవితేజ నటించిన భర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞప్తిచిత్రం మార్చి 13 నుంచి ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ కానుంది.కుటుంబ కథా నేపథ్యంలో భార్య–ప్రేయసి మధ్య చిక్కుకున్న వ్యక్తి జీవితాన్ని ఆసక్తికరంగా చూపిస్తుంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

తొలి పలుకు - తెలుగు వార్తలు & కథలు